- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Diabetes: టైప్-1 మధుమేహంతో ఆందోళన వద్దు
క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకుంటే దీర్ఘకాలం సాధారణ జీవితం గడపొచ్చు
‘ఈనాడు’తో ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ వి.మోహన్
ఈనాడు, దిల్లీ: టైప్-1 మధుమేహం బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ డయాబెటిస్ వైద్య నిపుణుడు డాక్టర్ వి.మోహన్ అన్నారు. రోజూ క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకుంటే దీర్ఘకాలం సాధారణ జీవితం గడపొచ్చని పేర్కొన్నారు. ఈ రకం మధుమేహాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) జారీచేసిన నూతన మార్గదర్శకాల రూపకర్తల్లో ఒకరైన ఆయన తాజాగా ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ‘‘దేశంలో టైప్-1 మధుమేహ బాధితులు 2.5 లక్షల మంది దాకా ఉన్నారు. వీరు ఒక్కరోజు ఇన్సులిన్ తీసుకోకపోయినా మరణించే ముప్పు ఉంటుంది. రోజుకు 3-4సార్లు ఇన్సులిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ తరహా మధుమేహం సాధారణంగా 15 ఏళ్లలోపు పిల్లల్లో వస్తుంది. అయితే కేవలం పిల్లలకే పరిమితం అవుతుందనుకోవడానికి వీల్లేదు. పెద్దల్లోనూ రావొచ్చు. దేశంలో టైప్-1 మధుమేహ బాధితుల సంఖ్య ఏటా 10 వేల వరకూ పెరుగుతోంది. ప్రధానంగా జన్యులోపం కారణంగా ఈ వ్యాధి వస్తుంది. బాధితులు ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటే సాధారణ జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదు. ప్రస్తుతం ఈ ఔషధాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే అందిస్తున్నారు. అనవసరంగా నాటువైద్యుల సలహాలతో మూలికలు, పసరు వంటివి వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు’’ అని వి.మోహన్ సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Munugode: మునుగోడులో కాంగ్రెస్కు మద్దతుపై ఆలోచిస్తాం: కోదండరాం
-
India News
Drugs: గుజరాత్లో ₹1026 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
-
Movies News
ప్రభాస్ ‘సలార్’- హృతిక్ ‘ఫైటర్’ ఢీ కొంటే!
-
Politics News
Telangana News: కాళేశ్వరం బయల్దేరిన కాంగ్రెస్ నేతలు అరెస్టు: మణుగూరు వద్ద ఉద్రిక్తత
-
India News
Swine flu: ముంబయిలో స్వైన్ఫ్లూ విజృంభణ.. 15రోజుల్లో ఎన్నికేసులంటే?
-
India News
Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- Karthikeya 2: కృష్ణతత్వం వర్కవుట్ అయింది.. నార్త్కు నచ్చేసింది!
- Google: పనితీరు బాగోలేదో ఇక ఇంటికే.. ఉద్యోగులను హెచ్చరించిన గూగుల్
- Ashwini Dutt: చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!
- Dil Raju: అలా రాసి మమ్మల్ని బలి పశువులను చేయొద్దు: దిల్ రాజు భావోద్వేగం
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్టొట చేరిన నిఘా నౌక..!
- Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!