యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ హెలికాప్టర్‌ను ఢీకొన్న పక్షి

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా కిందికి  దించారు. ఆదివారం వారణాసిలోని పోలీస్‌ లైన్‌ ప్రాంతం నుంచి లఖ్‌నవూకు సీఎం హెలికాప్టర్‌లో బయలుదేరారు.

Published : 27 Jun 2022 05:16 IST

అత్యవసరంగా దించివేత

వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా కిందికి  దించారు. ఆదివారం వారణాసిలోని పోలీస్‌ లైన్‌ ప్రాంతం నుంచి లఖ్‌నవూకు సీఎం హెలికాప్టర్‌లో బయలుదేరారు. పైకి ఎగిరే సమయంలో పక్షి హెలికాప్టర్‌ను ఢీకొనడంతో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఈ ఘటన తరువాత ముఖ్యమంత్రి యోగి సర్క్యూట్‌ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం విమానంలో లఖ్‌నవూ వెళ్లేందుకు బబత్‌పుర్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు