సముద్రంలో కూలిన ఓఎన్జీసీ హెలికాప్టర్
తొమ్మిదిమందితో ప్రయాణిస్తున్న ఓఎన్జీసీ హెలికాప్టర్ మంగళవారం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగులు, ఒకరు ఒప్పంద ఉద్యోగి. ముంబయి
నలుగురి మృతి
ముంబయి: తొమ్మిదిమందితో ప్రయాణిస్తున్న ఓఎన్జీసీ హెలికాప్టర్ మంగళవారం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగులు, ఒకరు ఒప్పంద ఉద్యోగి. ముంబయి తీరం నుంచి సుమారు 50 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న రిగ్కు ఉద్యోగులను తీసుకొని వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్లో ఆరుగురు ఓఎన్జీసీ ఉద్యోగులు, ఒక ఒప్పంద ఉద్యోగి, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మందిని నౌకదళ, తీరప్రాంత గస్తీ సిబ్బంది అత్యంత వేగంగా బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. ఇందులో అపస్మారకస్థితిలో ఉన్న నలుగురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.