లక్షకు చేరిన క్రియాశీలక కేసులు
దేశంలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు తాజాగా 24 గంటల వ్యవధిలో (మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు) 14,506 మందికి కొవిడ్-19 సోకింది. అంతకుముందు
కొత్తగా 14,506 మందికి కొవిడ్
దిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు తాజాగా 24 గంటల వ్యవధిలో (మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు) 14,506 మందికి కొవిడ్-19 సోకింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 11,793గా నమోదైన సంగతి తెలిసిందే. వైరస్తో పోరాడుతూ మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 4,34,33,345కు, మరణాల సంఖ్య 5,25,077కు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 99,602కు చేరిందని, మొత్తం కేసుల్లో వీటి వాటా 0.23 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.35 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.