ప్లాస్టిక్ నియంత్రణలో రాష్ట్రాలదే కీలకపాత్ర
దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిన ప్లాస్టిక్ (సింగిల్ యూజ్) నియంత్రణలో రాష్ట్రాలు కీలకపాత్ర పోషించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిషేధం గురించి విస్తృత ప్రచారం చేస్తూనే తయారీదారులపైనా ఓ కన్నేసి ఉంచాలని కోరుతోంది.
దిల్లీ: దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిన ప్లాస్టిక్ (సింగిల్ యూజ్) నియంత్రణలో రాష్ట్రాలు కీలకపాత్ర పోషించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిషేధం గురించి విస్తృత ప్రచారం చేస్తూనే తయారీదారులపైనా ఓ కన్నేసి ఉంచాలని కోరుతోంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమలను ఏడాది కిందటే అప్రమత్తం చేసినందున ఇక ఉపేక్షించాల్సిన పని లేదని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించినవారికి పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద జరిమానాలు, జైలుశిక్షలు విధించే అవకాశమున్నట్లు కూడా తెలిపారు. నిషేధాన్ని సమర్థవంతగా అమలు చేయడానికి జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో కంట్రోల్ రూంలు, రాష్ట్రాల్లో సరిహద్దు చెక్పోస్టుల వంటివి సైతం ఏర్పాటు చేయనున్నారు. దేశంలో ఏటా 2.4 లక్షల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం