తిడుతూ.. కొడుతూ..

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్యలాల్‌ను హత్య చేసిన నిందితులపై కోర్టు ప్రాంగణంలోనే దాడి జరిగింది. శనివారం.. నిందితులు రియాజ్‌ అఖ్తారీ, గౌస్‌ మహమ్మద్‌, మొహసిన్‌, ఆసిఫ్‌ను పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

Published : 03 Jul 2022 06:32 IST

జైపుర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్యలాల్‌ను హత్య చేసిన నిందితులపై కోర్టు ప్రాంగణంలోనే దాడి జరిగింది. శనివారం.. నిందితులు రియాజ్‌ అఖ్తారీ, గౌస్‌ మహమ్మద్‌, మొహసిన్‌, ఆసిఫ్‌ను పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వీరిని ఈ నెల 12 వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను కారాగారానికి తరలించేందుకు పోలీసు వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారిగా న్యాయవాదులు భద్రతా వలయాన్ని ఛేదించుకొని దాడి చేశారు. వారిని తిడుతూ, కొడుతూ.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుల్లో ఒకరి చొక్కాను చింపేశారు. వారిని ఉరి తీయాలంటూ న్యాయవాదులు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని