5 వేల అడుగుల ఎత్తులో విమానంలో పొగలు
మధ్యప్రదేశ్లోని జబల్పుర్కు వెళ్తున్న స్పైస్జెట్కు చెందిన విమానంలో పొగలు రావడాన్ని సిబ్బంది గుర్తించడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించి తిరిగి సురక్షితంగా దిల్లీ చేరడంతో పెను ప్రమాదం తప్పింది.
వెనక్కు వచ్చిన దిల్లీ - జబల్పుర్ స్పైస్జెట్ సర్వీసు
దిల్లీ: మధ్యప్రదేశ్లోని జబల్పుర్కు వెళ్తున్న స్పైస్జెట్కు చెందిన విమానంలో పొగలు రావడాన్ని సిబ్బంది గుర్తించడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించి తిరిగి సురక్షితంగా దిల్లీ చేరడంతో పెను ప్రమాదం తప్పింది. క్యూ400 ఎయిర్క్రాఫ్ట్ అయిదు వేల అడుగుల ఎత్తులో వెళుతున్నప్పుడు ఓ ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో పొగలు వచ్చాయని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్పైస్జెట్ విమానాల్లో రెండు వారాల్లోనే ఇలాంటి ఘటనలు అయిదు జరగడంతో డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, వారిని మరో విమానంలో జబల్పుర్కు పంపినట్లు స్పైస్జెట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారన్నది వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ