మెట్లపై జారిపడ్డ లాలూ..

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆదివారం మెట్ల పైనుంచి జారిపడటంతో వీపు భాగాన గాయమై భుజం విరిగింది. లాలూ కుటుంబ సన్నిహితవర్గాలు ఈ విషయం వెల్లడించాయి. భార్య రబ్రీదేవి

Published : 04 Jul 2022 05:06 IST

విరిగిన భుజం

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆదివారం మెట్ల పైనుంచి జారిపడటంతో వీపు భాగాన గాయమై భుజం విరిగింది. లాలూ కుటుంబ సన్నిహితవర్గాలు ఈ విషయం వెల్లడించాయి. భార్య రబ్రీదేవి నివాసంలో ఉంటున్న లాలూ ఇంటి మెట్లపై జారిపడ్డారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మూత్రపిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. భుజం వద్ద ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించిన వైద్యులు ఆ ప్రాంతంలో కట్టు కట్టి ఇంటికి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని