స్థాయీ సంఘాల కాలాన్ని రెండేళ్లకు పొడిగించాలి
పార్లమెంటరీ స్థాయీ సంఘాల కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించాలని వ్యవస్థ మెరుగుదల (సిస్టమ్ ఇంప్రూవ్మెంట్) కమిటీ నివేదిక సిఫార్సు చేసింది. రాజ్యసభ సచివాలయం పనితీరును సమగ్రంగా అధ్యయనం చేసి పని తీరు
రాజ్యసభ ఛైర్మన్కు ‘వ్యవస్థ మెరుగుదల’ నివేదిక సిఫార్సు
ఈనాడు, దిల్లీ: పార్లమెంటరీ స్థాయీ సంఘాల కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించాలని వ్యవస్థ మెరుగుదల (సిస్టమ్ ఇంప్రూవ్మెంట్) కమిటీ నివేదిక సిఫార్సు చేసింది. రాజ్యసభ సచివాలయం పనితీరును సమగ్రంగా అధ్యయనం చేసి పని తీరు మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి గానూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఈ ఏడాది జనవరిలో ‘‘సిస్టమ్ ఇంప్రూవ్మెంట్’’ పేరిట ఓ కమిటీని వేశారు. రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్ పి.పి.కె.రామాచార్యుల ఆధ్వర్యంలోని కమిటీ మంగళవారం తమ నివేదికను ఛైర్మన్ వెంకయ్యనాయుడికి అందజేసింది. 120 పేజీలతో కూడిన ఈ నివేదికలో 130 సూచనలు చేశారు. పాలన, ఆర్థిక, అధికారాలపై కమిటీ ప్రముఖంగా దృష్టిసారించింది. ‘‘పార్లమెంటరీ స్థాయీ సంఘాలు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏడాదిలో రెండుసార్లు పది రోజుల పాటు చేస్తున్న పర్యటనలను మూడు సార్లకు, అది పదిహేను రోజులకు పెంచాలి. ఆయా కమిటీలు సూచించిన అంశాల అమలుకు వాటి ప్రాధాన్యత ఆధారంగా పార్లమెంట్లో కనీసం గంట పాటు చర్చించాలి. వివిధ విభాగాలు, సేవల సమన్వయంతో వాటిలోని ఖాళీలపై దృష్టి సారించాలి. విభాగాధిపతులు, సంయుక్త కార్యదర్శులకు ప్రస్తుతం ఉన్న ఆర్థిక అధికారాల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. వేతనాలకు సంబంధించిన బడ్జెట్లో 2.5 శాతం శిక్షణ నిమిత్తం ఖర్చు చేయాలి. విభాగాలన్నీ సమన్వయంతో కలిపి పనిచేయాలి. పనిలో వేగం, చేసిన పనే చేయకుండా చూడడం, ఆదేశాల పరంపరను తగ్గించేందుకు ప్రసుత్తం ఉన్న 64 విభాగాలను 14 విభాగాలుగా పునర్వ్యవస్థీకరించాలి. సమస్యల పరిశీలన సమయంలో ప్యానెళ్లకు వివిధ భాగస్వాములు ఇచ్చిన విజ్ఞప్తులను ప్రాధాన్యం ఆధారంగావాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. రాజ్యసభ సచివాలయం 1952లో దాదాపు 200 మంది అధికారులు, సిబ్బందితో ప్రారంభమై ప్రస్తుతం 1,700 మంది సిబ్బందికి విస్తరించింది. ఈ విస్తరణకు అనుగుణంగా సేవలు, పని తీరులో పురోగతి ఉండాలి’’ అని నివేదిక సిఫార్సు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు