Monkeypox: కేరళలో కలకలం.. మంకీపాక్స్‌తో యువకుడి మృతి?

మంకీపాక్స్‌ సోకినట్లు భావిస్తున్న ఓ వ్యక్తి (22) కేరళలో మృతిచెందడం కలకలం రేపుతోంది. ఇటీవల యూఏఈ నుంచి తిరిగివచ్చిన ఆ యువకుడు శనివారం ఉదయం త్రిస్సూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందాడు.

Updated : 01 Aug 2022 07:16 IST

తిరువనంతపురం: మంకీపాక్స్‌ సోకినట్లు భావిస్తున్న ఓ వ్యక్తి (22) కేరళలో మృతిచెందడం కలకలం రేపుతోంది. ఇటీవల యూఏఈ నుంచి తిరిగివచ్చిన ఆ యువకుడు శనివారం ఉదయం త్రిస్సూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందాడు. అతను మంకీపాక్స్‌తోనే చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అతని మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ఆదివారం తెలిపారు. అతని శాంపిళ్లను పరీక్షలకు పంపించామని, ఫలితాలు రావాల్సి ఉందన్నారు. జులై 21న కేరళకు వచ్చిన అతన్ని ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యమైందన్న విషయాన్ని కూడా వైద్య, ఆరోగ్య శాఖ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. యువకుడైన అతనికి ఇతరత్రా అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. ‘‘కొవిడ్‌తో పోలిస్తే అంత తీవ్రంగా మంకీపాక్స్‌ వ్యాప్తి చెందదు. మరణాలు రేటు కూడా తక్కువే’’ అని మంత్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని