సీనియర్ అధికారులపై సీఐఎస్ఎఫ్ జవాన్ కాల్పులు
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) జవాన్ ఒకరు.. తన సీనియర్ సహచరులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంకు అనుకొని ఉన్న సీఐఎస్ఎఫ్
ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
కోల్కతా: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) జవాన్ ఒకరు.. తన సీనియర్ సహచరులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంకు అనుకొని ఉన్న సీఐఎస్ఎఫ్ బ్యారక్లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ ఎ.కె.మిశ్రగా పోలీసులు గుర్తించారు. మిశ్ర తన ఏకే-47 రైఫిల్తో అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ రంజిత్ సారంగి, అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ అధికారి సువీర్ ఘోష్పై కాల్పులు జరిపారు. అనంతరం ఆస్పత్రిలో సారంగి మృతి చెందారు. ‘‘సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందులో ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ ఆస్పత్రిలో చనిపోయారు. నిందితుడైన హెడ్ కానిస్టేబుల్ను అరెస్టు చేశాం’’ అని కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు. బ్యారక్లో చిన్న గదిలో దాక్కుని మిశ్ర.. కాల్పులు జరిపారని ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు అధికారి ఒకరు చెప్పారు. సీఐఎస్ఎఫ్ కూడా దీనిపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. 2019 నుంచి పార్క్స్ట్రీట్లోని ఇండియన్ మ్యూజియం భద్రతను సీఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!