Chennai: అమెరికా యుద్ధనౌకకు భారత్లో మరమ్మతులు.. ఇదే తొలిసారి
మరమ్మతుల కోసం అమెరికాకు చెందిన యుద్ధనౌక చార్లెస్ డ్రూ ఆదివారం భారత్ చేరుకుంది. చెన్నై కాటుపల్లిలోని ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన షిప్యార్డ్లో ఇది లంగరేసింది. మరమ్మతులు, ఇతర సేవల కోసం అమెరికా నౌక ఒకటి మన దేశానికి
దిల్లీ: మరమ్మతుల కోసం అమెరికాకు చెందిన యుద్ధనౌక చార్లెస్ డ్రూ ఆదివారం భారత్ చేరుకుంది. చెన్నై కాటుపల్లిలోని ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన షిప్యార్డ్లో ఇది లంగరేసింది. మరమ్మతులు, ఇతర సేవల కోసం అమెరికా నౌక ఒకటి మన దేశానికి చేరుకోవడం ఇదే తొలిసారి. ‘భారత్లో తయారీ’కి ఇది పెద్ద ఊతమని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. రెండు దేశాల మధ్య వృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది కొత్త కోణాన్ని జోడించిందని తెలిపింది. ఈ నౌక నిర్వహణ కోసం ఎల్ అండ్ టీ షిప్యార్డ్కు అమెరికా నౌకాదళం కాంట్రాక్టు ఇచ్చింది. చార్లెస్ డ్రూ యుద్ధనౌక ఇక్కడ 11 రోజులు ఉంటుంది. ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. యుద్ధనౌకల కోసం అధిక సామర్థ్యం కలిగిన డీజిల్ మెరైన్ ఇంజిన్ల రూపకల్పనకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతినిచ్చిందని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం 70 శాతం నిధులు సమకూరుస్తుందని చెప్పారు. 2-3 ఏళ్లలో 6 మెగావాట్లు అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన మెరైన్ డీజిల్ ఇంజిన్లను అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్లో మరిన్ని విదేశీ నౌకలకు భారత్లో మరమ్మతులు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్