Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ ఓ వాణిజ్య ప్రకటనలో వినిపించే డైలాగ్ ఇది. ఈ ప్రకటనలో పేర్కొన్నట్లుగా డబ్బులు మాత్రం ఎవరికీ ఊరికే రావు. ఇది వందకు వంద శాతం సత్యం. అలాంటిది బిహార్లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్
‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ ఓ వాణిజ్య ప్రకటనలో వినిపించే డైలాగ్ ఇది. ఈ ప్రకటనలో పేర్కొన్నట్లుగా డబ్బులు మాత్రం ఎవరికీ ఊరికే రావు. ఇది వందకు వంద శాతం సత్యం. అలాంటిది బిహార్లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ డీమ్యాట్ ఖాతాలో వారం రోజుల క్రితం ఏకంగా రూ.6,000 కోట్లకుపైగా నగదు జమైంది. ఈ మొత్తాన్ని పంపించింది ఎవరో తెలియడం లేదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే సుమన్ కుమార్కు.. కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ ఖాతా ఉంది. మరోవైపు, వారం రోజుల క్రితం అందులోకి రూ.6,833.42 కోట్లు వచ్చి చేరాయి. ఇటీవల ఖాతా తనిఖీ చేసుకున్న సుమన్కు విషయం తెలిసింది. ఇప్పటికీ డబ్బులు ఖాతాలోనే ఉన్నాయి. పొరపాటున నగదు బదిలీ అయిందనుకున్నా.. దీనిపై ఇంతవరకు ఎవరూ పోలీసులను సంప్రదించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై తమకు పూర్తి సమాచారం అందలేదని సూర్యగఢ స్టేషన్ హౌస్ అధికారి చందన్ కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే