మహిళను దూషించిన కేసులో నిందితుల అరెస్టు
నోయిడాలోని సెక్టార్-93లో గ్రాండ్ ఒమాక్స్ రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన ఒక మహిళను పరుష పదజాలంతో దూషించిన కేసులో అదే సొసైటీలో నివాసం ఉంటున్న రాజకీయ నాయకుడు శ్రీకాంత్ త్యాగిని పోలీసులు మేరఠ్లో అరెస్టు చేశారు. నిందితుడు
శ్రీకాంత్ త్యాగితోపాటు మరో ముగ్గురు..
ఈనాడు, లఖ్నవూ: నోయిడాలోని సెక్టార్-93లో గ్రాండ్ ఒమాక్స్ రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన ఒక మహిళను పరుష పదజాలంతో దూషించిన కేసులో అదే సొసైటీలో నివాసం ఉంటున్న రాజకీయ నాయకుడు శ్రీకాంత్ త్యాగిని పోలీసులు మేరఠ్లో అరెస్టు చేశారు. నిందితుడు తన ఇంటి చుట్టూ అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా సొసైటీ అనుమతి లేకుండా తన ఇంటి ముందు మొక్కలు నాటారు. దీనిపై ప్రశ్నించిన మహిళను దూషించడంతో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మేరఠ్లో శ్రీకాంత్ త్యాగితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. తాను భాజపా కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడినని పరారవడానికి ముందువరకు త్యాగి చెప్పుకోవడం రాజకీయంగా దుమారం రేపింది. భాజపా దీన్ని ఖండించింది. నిందితుడికి పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవని పేర్కొంది. ప్రతిపక్షాలు ఈ విషయంలో భాజపాపై విమర్శల దాడిచేశాయి. భాజపా సీనియర్ నాయకులతో శ్రీకాంత్ త్యాగి కలిసిఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశాయి. నిందితుడి అరెస్టు అనంతరం ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్య వారణాసిలో మీడియాతో మాట్లాడారు. నేరం చేసిన వ్యక్తి ఏ పార్టీకి చెందినా సరే చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తర్ప్రదేశ్లో చట్టబద్ధమైన పాలన ఉందని, చట్టం ఎవరికైనా ఒకేలా ఉంటుందని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్