మానవ అక్రమ రవాణాపై అవగాహనకు సమావేశాలు నిర్వహించండి
ప్రపంచీకరణ యుగంలో నానాటికీ పెరుగుతున్న మానవ అక్రమ రవాణా గురించి న్యాయాధికారులలో అవగాహన పెంచి, సమర్థమైన చర్యలు తీసుకోవడానికి రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని హైకోర్టులను కేంద్ర హోం
హైకోర్టులను కోరిన కేంద్ర హోంశాఖ
దిల్లీ: ప్రపంచీకరణ యుగంలో నానాటికీ పెరుగుతున్న మానవ అక్రమ రవాణా గురించి న్యాయాధికారులలో అవగాహన పెంచి, సమర్థమైన చర్యలు తీసుకోవడానికి రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని హైకోర్టులను కేంద్ర హోం శాఖ కోరింది. న్యాయ వ్యవస్థ, న్యాయ విద్యా సంస్థలు, శిక్షణ సంస్థలు, సంబంధిత ఇతర సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమీక్షా సమావేశాల నిర్వహణకు రూ.2 లక్షలు అందిస్తామని తెలిపింది. మానవ అక్రమ రవాణా గురించి అవగాహన లోపించడం వల్ల సకాలంలో సక్రమంగా కేసులు నమోదు చేయడం లేదని, ఈ నేరాలను ఎలా ఎదుర్కోవాలనే దాని మీద న్యాయాధికారులకు శిక్షణ లేదని ఆవేదన వ్యక్తంచేసింది. దీని వల్ల అక్రమ రవాణా నిరోధానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని హోం శాఖ తెలిపింది. ప్రపంచీకరణ యుగంలో మెరుగైన అవకాశాల కోసం జనం ఇతర దేశాలకు వలస పోవడం ఎక్కువైంది. సరైన పత్రాలు లేకుండా వలస పోయేవారు అక్రమ రవాణాదారుల చేతుల్లో పడుతున్నారు. ఆ దుష్ట శక్తులు వీరిని వెట్టి చాకిరీ, వ్యభిచారం, బలవంతపు వివాహాలు, ఇళ్లలో బండ చాకిరీ, భిక్షాటన, అవయవ చౌర్యం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా నేరాల్లోకి దించుతున్నాయి. శారీరక, లైంగిక హింస, వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నాయి. కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి రాష్ట్రాల మధ్యనే కాకుండా, పొరుగు దేశాలతోనూ సమన్వయ సహకారాలు నెరపాలని కేంద్ర హోం శాఖ అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరళ్లకు రాసిన లేఖలో పేర్కొంది. మానవ అక్రమ రవాణా గురించి పోలీసు, న్యాయాధికారులు, సరిహద్దు భద్రతా సిబ్బందికి పూర్తి విషయ పరిజ్ఞానం అందించాలని, పౌర సంఘాల సహకారమూ తీసుకోవాలని సూచించింది. దీనికోసం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు