ప్రధాని నివాసం వద్ద కదల్లేని స్థితిలో గద్ద!

నీళ్లందక అలమటిస్తూ ఎగరలేని స్థితిలో పడిఉన్న ఓ గద్దను దిల్లీలోని ప్రధానమంత్రి నివాసం వద్ద భద్రతా సిబ్బంది మంగళవారం ఉదయం గుర్తించారు. వన్యప్రాణుల సంరక్షణ సంస్థ (వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌)కు సమాచారం అందించారు. దీంతో సంస్థకు

Published : 10 Aug 2022 05:59 IST

డీహైడ్రేషన్‌తో పడిపోయిన పక్షి

సంరక్షించిన వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌

దిల్లీ: నీళ్లందక అలమటిస్తూ ఎగరలేని స్థితిలో పడిఉన్న ఓ గద్దను దిల్లీలోని ప్రధానమంత్రి నివాసం వద్ద భద్రతా సిబ్బంది మంగళవారం ఉదయం గుర్తించారు. వన్యప్రాణుల సంరక్షణ సంస్థ (వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌)కు సమాచారం అందించారు. దీంతో సంస్థకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం చేరుకుని ఆ పక్షిని సంరక్షించింది. డీహైడ్రేషన్‌ కారణంగా గ్రౌండ్‌పై అది కదల్లేనిస్థితిలో ఉండిపోయినట్లు గుర్తించి, దానికి నీళ్లందించారు. అనంతరం సంరక్షణ ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఆ గద్దను పరిశీలనలో ఉంచామని, పూర్తిగా కోలుకున్న తర్వాత అటవీప్రాంతంలో విడిచిపెడతామని ఆ సంస్థ తెలిపింది. దిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో ఇలాంటి గద్దల సంరక్షణకు సంబంధించిన అనేక కాల్స్‌ తమకు వస్తున్నట్లు వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ వెల్లడించింది. సాధారణంగా నీళ్లందక, డీహైడ్రేషన్‌కు గురై ఆ పక్షులు పడిపోతున్నట్లు సంస్థ కార్యదర్శి గీతా శేషమణి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని