బురద నీటిలో యోగా, స్నానం.. యువకుడి వినూత్న నిరసన

రహదారిపై గుంతల్లో నిలిచిన బురద నీటిలో ఓ యువకుడు యోగాసనాలు వేయడం, స్నానం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపేందుకు కేరళలోని మలప్పురానికి చెందిన హంస పొర్లి.. పండిక్కడ్‌లో ఇలా చేశాడు. రోడ్డుపై

Updated : 11 Aug 2022 07:42 IST

రహదారిపై గుంతల్లో నిలిచిన బురద నీటిలో ఓ యువకుడు యోగాసనాలు వేయడం, స్నానం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపేందుకు కేరళలోని మలప్పురానికి చెందిన హంస పొర్లి.. పండిక్కడ్‌లో ఇలా చేశాడు. రోడ్డుపై నిలిచిన బురద నీటితో దుస్తులు ఉతికాడు. అక్కడే యోగా, స్నానం చేశాడు. అదే మార్గంలో వెళుతున్న మంజేరి శాసనసభ్యుడు లతీఫ్‌.. ఈ యువకుడిని గమనించారు. ఆగి అతడితో మాట్లాడారు. నియోజకవర్గంలోని రోడ్లను సత్వరమే బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని