ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూ-కశ్మీర్‌లోని బడ్‌గామ్‌ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో లష్కరే తైబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్‌ పండిట్‌ ఉద్యోగి రాహుల్‌ భట్‌ను హత్య చేసిన

Published : 11 Aug 2022 05:15 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని బడ్‌గామ్‌ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో లష్కరే తైబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్‌ పండిట్‌ ఉద్యోగి రాహుల్‌ భట్‌ను హత్య చేసిన ఘటనలో ప్రమేయమున్న లతీఫ్‌ రాఠర్‌ మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడని పోలీసులు తెలిపారు. ‘‘ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే నెలలో టీవీ నటుడు అమీర్‌భట్‌, కశ్మీర్‌ పండిట్‌ ఉద్యోగి రాహుల్‌ భట్‌ హత్యలతో ప్రమేయమున్న లతీఫ్‌ రాఠర్‌ మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడు’’ అని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని