చీతాల పరిరక్షణకు ఎన్‌టీసీఏతో ఐవోసీ ఒప్పందం

చీతాలను నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు తరలించి సంరక్షించేందుకు ‘ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌’ (ఐవోసీ) ముందుకు వచ్చింది. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ

Published : 12 Aug 2022 06:34 IST

దిల్లీ: చీతాలను నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు తరలించి సంరక్షించేందుకు ‘ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌’ (ఐవోసీ) ముందుకు వచ్చింది. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ)తో ఈ మేరకు అవగాహన ఒప్పందంపై ఇటీవల సంతకం చేసింది. ఐదేళ్ల కాలంలో రూ.50.22 కోట్లను ఇండియన్‌ ఆయిల్‌ ఖర్చు చేయనుంది. 15-20 చీతాలను తీసుకురావడం, వాటి ఆవాస ప్రాంతాల పరిరక్షణ, సిబ్బందికి శిక్షణ వంటివాటికి ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని ఐవోసీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం ఈడీ డాక్టర్‌ భట్టాచార్య తెలిపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద దీనిని చేపట్టిన తొలి కార్పొరేట్‌ సంస్థగా ఐవోసీ నిలిచిందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని