భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టింది
భర్తతో గొడవపడిన ఆ ఇల్లాలు.. అతణ్ని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని గఢియా రంగీన్ పోలీస్స్టేషను పరిధిలో వెలుగుచూసింది. తన భర్త ఆత్మహత్య
షాజహాన్పుర్ (యూపీ): భర్తతో గొడవపడిన ఆ ఇల్లాలు.. అతణ్ని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని గఢియా రంగీన్ పోలీస్స్టేషను పరిధిలో వెలుగుచూసింది. తన భర్త ఆత్మహత్య చేసుకొన్నట్లు ఆమె అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. ఖమారియా గ్రామానికి చెందిన గోవింద్ ఈ నెల 7వ తేదీన తన భార్య శిల్పితో గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి గోవింద్ను కొట్టిచంపిన శిల్పి ఇంట్లోనే గొయ్యి తవ్వి పాతిపెట్టింది. రెండు రోజుల తర్వాత.. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగువారు మహారాష్ట్రలోని నాసిక్లో ఉంటున్న గోవింద్ తల్లికి సమాచారం చేరవేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు గ్రామీణ ఎస్పీ సంజీవ్ బాజ్పాయ్ తెలిపారు. తన భర్త మద్యం వ్యసనపరుడని శిల్పి పోలీసులకు తెలిపింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, విచారణ కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్