సాంఘిక బహిష్కరణ పేరుతో.. అంత్యక్రియల నిరాకరణ
కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో 27 సంవత్సరాల క్రితం సాంఘిక బహిష్కరణకు గురై మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలు చేసేందుకు గ్రామస్థులు నిరాకరించిన ఘటనిది.
అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో ఘటన
గువాహటి: కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో 27 సంవత్సరాల క్రితం సాంఘిక బహిష్కరణకు గురై మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలు చేసేందుకు గ్రామస్థులు నిరాకరించిన ఘటనిది. అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని పటోల్సింగ్పారా ప్రాంతంలో నివాసముంటున్న అతుల్ శర్మ(50) మంగళవారం మరణించాడు. కులాంతర వివాహం చేసుకున్నాడని.. సాంఘిక బహిష్కరణకు గురైన తన భర్త అంత్యక్రియల నిర్వహణకు గ్రామస్థులు ముందుకు రాలేదని మృతుడి భార్య పేర్కొంది. అంత్యక్రియల సమయానికి వారి కుమారుడు కూడా అక్కడికి చేరుకోలేకపోయాడు. దీంతో గ్రామస్థుల ఒత్తిడితో మృతదేహాన్ని దహనం చేయకుండా ఖననం చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల అంగీకారంతో పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం వారి సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలిక ఇదే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...