సాంఘిక బహిష్కరణ పేరుతో.. అంత్యక్రియల నిరాకరణ
కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో 27 సంవత్సరాల క్రితం సాంఘిక బహిష్కరణకు గురై మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలు చేసేందుకు గ్రామస్థులు నిరాకరించిన ఘటనిది.
అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో ఘటన
గువాహటి: కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో 27 సంవత్సరాల క్రితం సాంఘిక బహిష్కరణకు గురై మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలు చేసేందుకు గ్రామస్థులు నిరాకరించిన ఘటనిది. అస్సాంలోని దర్రాంగ్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని పటోల్సింగ్పారా ప్రాంతంలో నివాసముంటున్న అతుల్ శర్మ(50) మంగళవారం మరణించాడు. కులాంతర వివాహం చేసుకున్నాడని.. సాంఘిక బహిష్కరణకు గురైన తన భర్త అంత్యక్రియల నిర్వహణకు గ్రామస్థులు ముందుకు రాలేదని మృతుడి భార్య పేర్కొంది. అంత్యక్రియల సమయానికి వారి కుమారుడు కూడా అక్కడికి చేరుకోలేకపోయాడు. దీంతో గ్రామస్థుల ఒత్తిడితో మృతదేహాన్ని దహనం చేయకుండా ఖననం చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల అంగీకారంతో పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం వారి సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్