చైనా మాంజా గొంతుకు చుట్టుకొని వ్యక్తి మృతి

చైనా మాంజా గొంతుకు చుట్టుకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈశాన్య దిల్లీలోని శాస్త్రీ పార్క్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముండ్కాలోని రాజధాని పార్క్‌లో నివాసం ఉంటున్న విపిన్‌ కుమార్‌(34), తన భార్య, కుమార్తెతో కలిసి రక్షా బంధన్‌ జరుపుకొనేందుకు ద్విచక్రవాహనంపై గురువారం సాయంత్రం

Published : 14 Aug 2022 05:52 IST

దిల్లీ: చైనా మాంజా గొంతుకు చుట్టుకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈశాన్య దిల్లీలోని శాస్త్రీ పార్క్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముండ్కాలోని రాజధాని పార్క్‌లో నివాసం ఉంటున్న విపిన్‌ కుమార్‌(34), తన భార్య, కుమార్తెతో కలిసి రక్షా బంధన్‌ జరుపుకొనేందుకు ద్విచక్రవాహనంపై గురువారం సాయంత్రం తన అత్తమామల ఇంటికి బయలుదేరాడు. ఐఎస్‌బీటీ-సీలంపుర్‌ రహదారిలో ఉన్న పై వంతెన సమీపంలోకి రాగానే విపిన్‌ కుమార్‌ మెడకు గాలిపటానికి ఉన్న మాంజా చుట్టుకొని గొంతుకు తీవ్ర గాయమైంది. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని