రోదసి నుంచి అమృతోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న భారత్కు నింగి నుంచీ శుభాకాంక్షలు వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న ఇటలీ వ్యోమగామి సమంతా
దిల్లీ: స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న భారత్కు నింగి నుంచీ శుభాకాంక్షలు వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న ఇటలీ వ్యోమగామి సమంతా క్రిస్టోఫొరెట్టి వీడియో ద్వారా సందేశాన్ని తెలియజేశారు. ‘‘75 ఏళ్ల స్వతంత్ర భారత్కు శుభాకాంక్షలు చెప్పడం ఆనందానిస్తోంది. దశాబ్దాలుగా ఎన్నో రోదసి ప్రయోగాల్లో అంతర్జాతీయ సంస్థలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కలిసి పనిచేస్తున్నాయి. అమెరికా, భారత్లు సంయుక్తంగా ప్రయోగించబోయే ‘నిసార్’ ఉపగ్రహం ద్వారా విపత్తుల గురించి నిశితంగా శోధించడానికి వీలవుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు. సమంత సందేశానికి ఇస్రో కృతజ్ఞతలు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం