బెంగళూరులో హోరెత్తిన స్వాతంత్య్ర నడక
స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ నిర్వహించిన ‘స్వాతంత్య్ర నడక’కు బెంగళూరులో అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గాల్లో పది రోజులుగా ‘నడక’ కొనసాగించిన నేతల
బెంగళూరు శివాజీనగర, యశ్వంతపుర, న్యూస్టుడే: స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ నిర్వహించిన ‘స్వాతంత్య్ర నడక’కు బెంగళూరులో అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గాల్లో పది రోజులుగా ‘నడక’ కొనసాగించిన నేతల దండు ఆదివారం సాయంత్రానికే నగరానికి చేరుకుంది. సోమవారం ఉదయం రైల్వేస్టేషన్ సమీపంలోని సంగొళ్లి రాయణ్ణ విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బసవనగుడిలోని నేషనల్ కళాశాల మైదానం వద్ద ముగిసింది. ‘లక్ష మంది ప్రజలు- లక్ష జాతీయ పతాకాలు’ అనే నినాదంతో కొనసాగిన యాత్రకు పీసీసీ అధ్యక్షుడు శివకుమార్, అసెంబ్లీలో విపక్ష నాయకుడు సిద్ధరామయ్య, సీనియరు నాయకులు బి.కె.హరిప్రసాద్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, ఎం.బి.పాటిల్, రామలింగారెడ్డి, సలీం అహ్మద్ తదితరులు నేతృత్వం వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ