మహిళపై క్రూర అత్యాచారం

మధ్యప్రదేశ్‌ సింగ్రౌలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 30ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి, ప్రైవేటు భాగాల్లోకి కర్ర చొప్పించాడు. ఝుమరియా టోలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 16 Aug 2022 06:42 IST

మధ్యప్రదేశ్‌ సింగ్రౌలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 30ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి, ప్రైవేటు భాగాల్లోకి కర్ర చొప్పించాడు. ఝుమరియా టోలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ నివాసం ఉండే గ్రామానికే చెందిన నిందితుడు అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. అత్యాచారం చేసి పాశవికంగా ప్రవర్తించాడు. జననాంగాల్లోకి కర్రను చొప్పించాడు. మహిళ గట్టిగా అరిచేసరికి నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో తన మొబైల్‌ ఫోన్‌ను అక్కడే పడేసుకున్నాడు. బాధితురాలి అరుపులు విన్న కుటుంబ సభ్యులు.. పొరుగువారి సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మోర్వా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మహిళకు ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని మోర్వా పోలీస్‌స్టేషన్‌ బాధ్యుడు మనీశ్‌ త్రిపాఠి తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని