మహిళపై క్రూర అత్యాచారం
మధ్యప్రదేశ్ సింగ్రౌలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 30ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి, ప్రైవేటు భాగాల్లోకి కర్ర చొప్పించాడు. ఝుమరియా టోలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ సింగ్రౌలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 30ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి, ప్రైవేటు భాగాల్లోకి కర్ర చొప్పించాడు. ఝుమరియా టోలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ నివాసం ఉండే గ్రామానికే చెందిన నిందితుడు అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. అత్యాచారం చేసి పాశవికంగా ప్రవర్తించాడు. జననాంగాల్లోకి కర్రను చొప్పించాడు. మహిళ గట్టిగా అరిచేసరికి నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో తన మొబైల్ ఫోన్ను అక్కడే పడేసుకున్నాడు. బాధితురాలి అరుపులు విన్న కుటుంబ సభ్యులు.. పొరుగువారి సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మోర్వా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మహిళకు ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని మోర్వా పోలీస్స్టేషన్ బాధ్యుడు మనీశ్ త్రిపాఠి తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే