వాజ్‌పేయీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు.

Published : 17 Aug 2022 04:05 IST

దిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. దిల్లీలోని వాజ్‌పేయీ స్మారక ప్రాంతమైన ‘సదైవ్‌ అటల్‌’ వద్ద వారంతా శ్రద్ధాంజలి ఘటించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అమిత్‌ షా, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని