త్రివర్ణశోభితం

దేశవ్యాప్తంగా జాతీయ జెండాతో తీసుకున్న సెల్ఫీలు (స్వీయ చిత్రాలు) 6 కోట్లకు పైగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అయినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఈమేరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ను విజయవంతం చేయడానికి యావత్తు

Published : 17 Aug 2022 05:51 IST

జాతీయ జెండాలతో 6 కోట్ల సెల్ఫీలు..

దిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ జెండాతో తీసుకున్న సెల్ఫీలు (స్వీయ చిత్రాలు) 6 కోట్లకు పైగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అయినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఈమేరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ను విజయవంతం చేయడానికి యావత్తు దేశం కలిసి వచ్చిందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సాధించిన మైలురాళ్లను ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ వివరించింది. ఇళ్ల వద్ద జాతీయ పతాకాలను ఎగురవేస్తూ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమంలో పాల్గొనాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ జులై 22న పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌కు నోడల్‌ ఏజెన్సీగా ఉన్న సాంస్కృతిక శాఖ కూడా జాతీయ పతాకాలతో తీసుకున్న సెల్ఫీలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కోరింది. వీటికి భారీగా స్పందన లభించింది. ఈమేరకు దేశ పౌరులకు మంత్రి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని