చెప్పకుండా పరీక్ష కేంద్రాలు, తేదీల మార్పు!
ముందస్తు సమాచారం లేకుండా పరీక్ష తేదీలను మార్పు చేయడం.. ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలను మార్చడం, అవి తమ నివాసాలకు చాలా దూరంగా ఉండటం.. మళ్లీ రాసే అవకాశం
సీఈయూటీ అభ్యర్థుల ఆందోళన
దిల్లీ: ముందస్తు సమాచారం లేకుండా పరీక్ష తేదీలను మార్పు చేయడం.. ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలను మార్చడం, అవి తమ నివాసాలకు చాలా దూరంగా ఉండటం.. మళ్లీ రాసే అవకాశం ఉంటుందా అనే విషయమై స్పష్టత లేకపోవడం.. వంటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశపరీక్ష (సీఈయూటీ-యూజీ) అభ్యర్థులు గురువారం ఆందోళనకు లోనయ్యారు. ఈమేరకు సీఈయూటీ నాలుగో విడతలో రెండో రోజు పరీక్ష సందర్భంగా పలుచోట్ల విద్యార్థులు గందరగోళానికి లోనయ్యారు. నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు హాజరు కాలేకపోవడం వంటి కారణాలతో కొందరు పరీక్షలు రాయలేకపోయారు. చాలామందికి ఈనెల 30న రాసేందుకు తేదీని కేటాయించగా.. వారి పరీక్ష ముందుకు (గురువారానికి) జరపడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ విషయమై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని వారంతా చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్