చెప్పకుండా పరీక్ష కేంద్రాలు, తేదీల మార్పు!

ముందస్తు సమాచారం లేకుండా పరీక్ష తేదీలను మార్పు చేయడం.. ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలను మార్చడం, అవి తమ నివాసాలకు చాలా దూరంగా ఉండటం.. మళ్లీ రాసే అవకాశం

Published : 19 Aug 2022 04:49 IST

సీఈయూటీ అభ్యర్థుల ఆందోళన

దిల్లీ: ముందస్తు సమాచారం లేకుండా పరీక్ష తేదీలను మార్పు చేయడం.. ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలను మార్చడం, అవి తమ నివాసాలకు చాలా దూరంగా ఉండటం.. మళ్లీ రాసే అవకాశం ఉంటుందా అనే విషయమై స్పష్టత లేకపోవడం.. వంటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాల ఉమ్మడి ప్రవేశపరీక్ష (సీఈయూటీ-యూజీ) అభ్యర్థులు గురువారం ఆందోళనకు లోనయ్యారు. ఈమేరకు సీఈయూటీ నాలుగో విడతలో రెండో రోజు పరీక్ష సందర్భంగా పలుచోట్ల విద్యార్థులు గందరగోళానికి లోనయ్యారు. నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు హాజరు కాలేకపోవడం వంటి కారణాలతో కొందరు పరీక్షలు రాయలేకపోయారు. చాలామందికి ఈనెల 30న రాసేందుకు తేదీని కేటాయించగా.. వారి పరీక్ష ముందుకు (గురువారానికి) జరపడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఈ విషయమై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని వారంతా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని