శాంతియుత ‘ఇండో-పసిఫిక్’ను భారత్ కాంక్షిస్తోంది: జైశంకర్
అందరూ ఆమోదించిన నియమాల ప్రాతిపదికపై ఇండో-పసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా, స్వేచ్ఛగా, సమ్మిళిత అభివృద్ధి సాధించాలని భారత్ ఆకాంక్షిస్తోందని విదేశీ వ్యవహారాలశాఖ
బ్యాంకాక్: అందరూ ఆమోదించిన నియమాల ప్రాతిపదికపై ఇండో-పసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా, స్వేచ్ఛగా, సమ్మిళిత అభివృద్ధి సాధించాలని భారత్ ఆకాంక్షిస్తోందని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం ఉద్ఘాటించారు. ఈ ప్రాంత దేశాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేలలా సుస్థిర వాతావరణం ఏర్పాటుకు ఆయన పిలుపునిచ్చారు. మూడు రోజుల థాయ్లాండ్ పర్యటనలో భాగంగా గురువారం ఇక్కడి చులాలాంగ్ కార్న్ విశ్వవిద్యాలయంలో జైశంకర్ ప్రసంగించారు. ఇండో-థాయ్లాండ్ సంయుక్త కమిషన్ 9వ సమావేశానికి థాయ్ విదేశాంగమంత్రి డాన్ ప్రముద్వినైతో కలసి సహ అధ్యక్షులుగా వ్యవహరించారు. రక్షణ, వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్లు, పర్యాటక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంతోపాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల వృద్ధిపైనా వారిద్దరూ చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు