కొన్ని రాష్ట్రాల్లో మహిళలకే ఎక్కువమంది లైంగిక భాగస్వాములు
కొన్ని రాష్ట్రాల్లో పురుషులు కంటే మహిళలకే ఎక్కువ మంది శృంగార భాగస్వామ్యులు ఉన్నారని జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) తెలిపింది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మగాళ్లతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది
జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వేలో వెల్లడి
దిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో పురుషులు కంటే మహిళలకే ఎక్కువ మంది శృంగార భాగస్వామ్యులు ఉన్నారని జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) తెలిపింది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మగాళ్లతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు నెరిపారని పేర్కొంది. దేశంలోని లైంగిక జీవనానికి సంబంధించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
* రాజస్థాన్, హరియాణా, చండీగఢ్, జమ్మూ-కశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అస్సాం, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషులు కంటే మహిళలకే అధికమందితో లైంగిక భాగస్వామ్యం ఉంది.
* రాజస్థాన్లో సగటున ఓ మహిళ 3.1 మందితో లైంగిక సంబంధం కలిగి ఉండగా.. పురుషుడు 1.8 మందితో ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
* పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోని పురుషులు, మహిళల లైంగిక భాగస్వామ్యుల సగటు అధికంగా ఉంది.
* జీవిత భాగస్వామి లేదా సహజీవనం చేస్తున్న వ్యక్తితో కాకుండా ఇతర వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్న పురుషులు 4శాతంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. మహిళల్లో ఇది 0.5 శాతంగా ఉంది.
* పట్టణ ప్రాంతాల్లో సగటున ఒక పురుషుడు 1.7 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండగా, మహిళ 1.5 మందితో శారీరక బంధాన్ని కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 0.3 శాతం కాగా, మహిళ జీవిత కాలంలో సెక్స్ భాగస్వాముల సంఖ్య 1.7గా ఉంది.
* ఆంధ్రప్రదేశ్లో ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగిన మహిళలు 0.1 శాతంగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు.
* తెలంగాణలో 0.4 శాతం మంది మహిళలు ఇద్దరు కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇది పురుషుల్లో 2.1శాతంగా ఉంది.
* ఈ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21)ను దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మంది పురుషులపై నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!