Guinness Record : కత్తుల విన్యాసాలతో గిన్నిస్‌ రికార్డ్‌

అయిదు వేలమంది రాజ్‌పుత్‌ యువకులు కత్తులతో విన్యాసాలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ ఘటన శుక్రవారం జరిగింది. చరిత్రాత్మక భూచర్‌ మోరీ మైదాన్‌ యుద్ధంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం.. అఖిల గుజరాత్‌

Updated : 20 Aug 2022 07:29 IST

యిదు వేలమంది రాజ్‌పుత్‌ యువకులు కత్తులతో విన్యాసాలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ ఘటన శుక్రవారం జరిగింది. చరిత్రాత్మక భూచర్‌ మోరీ మైదాన్‌ యుద్ధంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం.. అఖిల గుజరాత్‌ రాజ్‌పుత్‌ యువసంఘ్‌తోపాటు షహీద్‌ స్మారక ట్రస్ట్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 17 జిల్లాలకు చెందిన యువకులు.. స్థానిక ఎమ్మెల్యే హకుభా జడేజా, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, రాష్ట్ర మంత్రి కీర్తిసింగ్‌ వాఘేలా హాజరయ్యారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తింపు పత్రాన్ని నిర్వాహకులకు అందజేశారు. 430 ఏళ్ల క్రితం జామ్‌నగర్‌ జిల్లాలోని ధ్రోల్‌ నగర్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో భూచర్‌ మోరీ మైదానంలో మొగల్‌ సేనతో అత్యంత భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో వేలాది ప్రజలు ప్రాణాలు అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని