అది ప్రజలను మోసగించే ఎత్తుగడ

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆటవిక పాలన నడుస్తోంది. మహిళలపై అనునిత్యం అత్యాచారాలు, అఘాయిత్యాలు, కోర్టుల సమీపంలోనే హత్యలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడంతో నేరస్థులు ఏమాత్రం భయపడటం

Published : 20 Aug 2022 06:04 IST

మాయావతి

త్తర్‌ప్రదేశ్‌లో ఆటవిక పాలన నడుస్తోంది. మహిళలపై అనునిత్యం అత్యాచారాలు, అఘాయిత్యాలు, కోర్టుల సమీపంలోనే హత్యలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడంతో నేరస్థులు ఏమాత్రం భయపడటం లేదు. అభివృద్ధి కార్యక్రమాల గురించి భాజపా చేస్తున్న ప్రచారం ప్రజలను మోసం చేసే ఎత్తుగడ మాత్రమే. పేదరికం, నిరుద్యోగంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


మానవాళి శ్రేయస్సే పరమావధి కావాలి

దలైలామా

అందరూ సాటివారిని సోదరభావంతో చూడాలి. ఇతరుల సంక్షేమం గురించి ఆలోచించాలి. సంపదను పోగు చేసుకోవడంపైనే దృష్టిపెట్టకుండా, అర్థవంతమైన పనులను చేయాలి. మొత్తంగా మానవాళి శ్రేయస్సు కోసం మన వంతు కృషి చేయాలి. అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని