శిక్ష పెంపునకు ముందు దోషులకు నోటీసులివ్వండి
దోషుల శిక్షా కాలాన్ని పెంచే ముందు వారికి నోటీసులివ్వాలని హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనివల్ల కేసులో ప్రతివాదనలను వినిపించే అవకాశం వారికి లభిస్తుందని తెలిపింది. ఓ హత్య కేసులో ఇద్దరు దోషులకు మిగిలిన జీవిత
హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశం
దిల్లీ: దోషుల శిక్షా కాలాన్ని పెంచే ముందు వారికి నోటీసులివ్వాలని హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనివల్ల కేసులో ప్రతివాదనలను వినిపించే అవకాశం వారికి లభిస్తుందని తెలిపింది. ఓ హత్య కేసులో ఇద్దరు దోషులకు మిగిలిన జీవిత కాలమంతా జైలు శిక్షననుభవించేలా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ పి.ఎస్.నరసింహల ధర్మాసనం కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సెషన్స్ కోర్టు జడ్జి విధించిన శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ముద్దాయిలేనని, రాష్ట్ర ప్రభుత్వం వారికి మరణ శిక్ష విధించాలని కోరుతూ అప్పీలు దాఖలు చేయలేదని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే, హైకోర్టు తనకున్న సుమోటో అధికారాలతో ఆ దోషులకు శిక్షా కాలాన్ని పొడిగించినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో అప్పీలుదారులకు హైకోర్టు ముందుగా నోటీసులివ్వాలని, తద్వారా శిక్షను ఎందుకు పెంచకూడదో వాదించుకునే అవకాశాన్ని కల్పించాలని వివరించింది. హత్య కేసును అత్యంత అరుదైన కేసుగా గుర్తించడంలో సెషన్స్ కోర్టు విఫలమైందని అభిప్రాయపడడంతో పాటు మరణ శిక్ష విధించలేదనే నిర్ణయానికీ హైకోర్టు వచ్చినట్లు తెలుస్తోందని పేర్కొంది. దోషులకు శిక్ష పెంచే ముందు నోటీసులివ్వనందున తీర్పును కొట్టి వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం