Income tax: ఆర్జన రోజుకు రూ.500.. ఆదాయపు పన్ను రూ.37.5 లక్షలు
కూలి పనులు చేస్తూ రోజుకు రూ.500 సంపాదించే ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందాయి. బిహార్లోని ఖగాఢియా జిల్లా మఘౌనా గ్రామానికి చెందిన గిరీశ్ యాదవ్ను.. ‘‘మీ పేరున బకాయి పడిన రూ. 37.5 లక్షల ఆదాయపు
కూలి పనులు చేస్తూ రోజుకు రూ.500 సంపాదించే ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందాయి. బిహార్లోని ఖగాఢియా జిల్లా మఘౌనా గ్రామానికి చెందిన గిరీశ్ యాదవ్ను.. ‘‘మీ పేరున బకాయి పడిన రూ. 37.5 లక్షల ఆదాయపు పన్నును వెంటనే చెల్లించాలి’’ అని ఐటీ శాఖ నోటీసు జారీ చేసింది. దాన్ని చూసిన గిరీశ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే దగ్గర్లో ఉన్న అలౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్హౌస్ అధికారి పురేంద్ర కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారుడి పేరుతో ఉన్న పాన్ నంబరు ద్వారా నోటీసు జారీ అయిందన్నారు. ‘‘గిరీశ్ ఉపాధి కోసం దిల్లీలో చిన్నచిన్న పనులు చేస్తుంటానని చెప్పాడు. అక్కడే పాన్ కార్డు కోసం గతంలో ఓ మధ్యవర్తిని సంప్రదించాడు. ఆ తర్వాత మధ్యవర్తి ఎప్పుడూ తనను కలవలేదని చెప్పాడు. రాజస్థాన్లో ఉన్న ఓ కంపెనీతో గిరీశ్కు సంబంధం ఉన్నట్లుగా ఐటీ శాఖ నోటీసుల్లో ఉంది’’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల