ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల విషయంలో.. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం..
‘‘ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశంలోని వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ లోక్సభ కమిటీ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు నివేదించింది
సుప్రీంకోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్
ఈనాడు, దిల్లీ: ‘‘ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశంలోని వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ లోక్సభ కమిటీ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు నివేదించింది. దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది’’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలియజేశారు. ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చిన తమకు దేశంలో వైద్య విద్య కొనసాగించే అవకాశం కల్పించాలంటూ వైద్య విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే.. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం నుంచి సూచనలు పొందేందుకు తనకు మరికొంత గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ కోరారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్