క్లాస్‌రూంలో మందేసి చిందేసిన ప్రొఫెసర్‌

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్‌ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. తరగతి గదిలోనే మద్యం తాగుతూ చిందులేశాడు. పంజాబ్‌ పఠాన్‌కోట్‌లోని జీఎన్‌డీయూ కళాశాలలో

Published : 22 Sep 2022 05:14 IST

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్‌ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. తరగతి గదిలోనే మద్యం తాగుతూ చిందులేశాడు. పంజాబ్‌ పఠాన్‌కోట్‌లోని జీఎన్‌డీయూ కళాశాలలో ఈ ఘటన జరగగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సొంత డబ్బులతో మద్యం తాగుతున్నానని, తనను ఎవరూ ప్రశ్నించలేరని ఆయన వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డు అయింది. అంతేగాక ఓ సినీ గీతాన్ని ఆలపిస్తూ నృత్యం చేయడం కనిపించింది. దీనిపై ఆ ప్రొఫెసర్‌ స్పందించాడు. తాను ఆ సమయంలో మద్యం తాగలేదని, తాగినట్లు నటించానని పేర్కొన్నాడు. అదంతా సరదాగా చేసినట్లు చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని