రిషికేశ్ చేరుకున్న కిరణ్ సేథ్ సైకిల్ యాత్ర
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సైకిల్ యాత్ర చేపట్టిన స్పీక్ మాకే సంస్థ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కిరణ్ సేథ్ మరో ఇద్దరు సభ్యులతో కలిసి గురువారం రిషికేశ్ చేరుకున్నారు. ఆయనకు స్థానిక ప్రజలు సాదరస్వాగతం పలికారు. ఈ
ఇప్పటివరకూ 1,000 కి.మీ. పూర్తి
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సైకిల్ యాత్ర చేపట్టిన స్పీక్ మాకే సంస్థ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కిరణ్ సేథ్ మరో ఇద్దరు సభ్యులతో కలిసి గురువారం రిషికేశ్ చేరుకున్నారు. ఆయనకు స్థానిక ప్రజలు సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకిల్ తొక్కడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక అభివృద్ధి కూడా జరుగుతుందని పేర్కొన్నారు. అక్టోబరు 2 నాటికి తన సైకిల్యాత్ర దిల్లీలోని రాజ్ఘాట్కు చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకూ ఆయన 1,000 కి.మీ. ప్రయాణించారు. కిరణ్.. ఖరగ్పుర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి న్యూయార్క్లోని కొలంబియా వర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఆయన దేశీయ కళలు సంస్కృతికి ప్రపంచదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా