అర్బన్ నక్సల్స్తో తస్మాత్ జాగ్రత్త
అర్బన్ నక్సల్స్, అభివృద్ధి నిరోధక శక్తులపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలతో పాటు న్యాయస్థానాలనూ ప్రభావితం చేస్తున్నారని
రాష్ట్ర మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ
అహ్మదాబాద్: అర్బన్ నక్సల్స్, అభివృద్ధి నిరోధక శక్తులపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలతో పాటు న్యాయస్థానాలనూ ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. సర్దార్ సరోవర్ (నర్మద) డ్యామ్ నిర్మాణం ఆలస్యం కావడానికి వీళ్లే ప్రధాన కారణమని ధ్వజమెత్తారు. అర్బన్ నక్సల్స్ ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నారని, వీరికి వివిధ సంస్థల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. గుజరాత్లోని నర్మదా జిల్లా ఏక్తానగర్లో రాష్ట్రాల పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును శుక్రవారం ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రసంగించారు. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సమతుల విధానాన్ని పాటించాలని సూచించారు. ‘‘సర్దార్ సరోవర్ డ్యామ్ను అడ్డుకునేందుకు కొందరు దుష్ప్రచారం చేశారు. ప్రపంచ బ్యాంకుతో పాటు న్యాయస్థానాలనూ ప్రభావితం చేసి ప్రాజెక్టును అడ్డుకున్నారు. దీని వల్ల ధనం, సమయం వృథా అయింది. ఇప్పుడు డ్యామ్ పూర్తైంది. అర్బన్ నక్సల్స్, అభివృద్ధి నిరోధక శక్తుల ఆరోపణల్లో నిజం లేదని తేలింది. వాళ్లు ఆరోపించినట్లుగా పర్యావరణానికి హాని కలగలేదు. డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతమంతా ప్రకృతి ప్రేమికుల తీర్థ క్షేత్రంగా మారింది’’ అని మోదీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!