ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా కె.రాజప్రసాద్ రెడ్డి
ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా కె.రాజప్రసాద్ రెడ్డి (సాక్షి) శుక్రవారం ఎన్నికయ్యారు. హిందీ పత్రిక ‘ఆజ్ సమాజ్’లో పనిచేస్తున్న రాకేశ్శర్మ డిప్యూటీ ప్రెసిడెంటుగా బాధ్యతలు
దిల్లీ: ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా కె.రాజప్రసాద్ రెడ్డి (సాక్షి) శుక్రవారం ఎన్నికయ్యారు. హిందీ పత్రిక ‘ఆజ్ సమాజ్’లో పనిచేస్తున్న రాకేశ్శర్మ డిప్యూటీ ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపడతారు. ‘మాతృభూమి’ ఆరోగ్య పత్రికకు చెందిన ఎం.వి.శ్రేయమ్స్ కుమార్ వైస్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. సొసైటీ 83వ వార్షిక సమావేశంలో ఈ ఎన్నికలు జరిగినట్లు ఐఎన్ఎస్ తెలిపింది. తన్మయ్ మహేశ్వరి (అమర్ ఉజాలా) కోశాధికారిగా ఎన్నికయ్యారు. వీడియో కాన్ఫరెన్సు, ఇతర మాధ్యమాల ద్వారా ఈ వార్షిక సమావేశం జరిగింది. 41 మందితో కూడిన ఐఎన్ఎస్ కార్యనిర్వాహక సంఘంలో మోహిత్ జైన్ (ది ఎకనమిక్ టైమ్స్), వివేక్ గోయెంకా (ది ఇండియన్ ఎక్స్ప్రెస్), జయంత్ మమ్మేన్ మాథ్యూ (మలయాళ మనోరమ), అతిదేబ్ సర్కార్ (ది టెలిగ్రాఫ్), కె.ఎన్.తిలక్కుమార్ (డెక్కన్ హెరాల్డ్ అండ్ ప్రజావాణి) సభ్యులుగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు