ప్రచారానికి పోతే.. పరువు తుస్‌

ప్రచారం కోసమో.. మరే ప్రయోజనం ఆశించారో తెలియదు కానీ, మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లా జైసింగ్‌ నగర్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి అత్యుత్సాహం ఇపుడు ఆయన మెడకు చుట్టుకుంటోంది. ఈ పాఠశాలలో అయిదో తరగతి

Published : 25 Sep 2022 07:01 IST

విద్యార్థిని దుస్తులు విప్పించి ఉతికిన ఉపాధ్యాయుడు

శహడోల్‌ (మధ్యప్రదేశ్‌): ప్రచారం కోసమో.. మరే ప్రయోజనం ఆశించారో తెలియదు కానీ, మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లా జైసింగ్‌ నగర్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి అత్యుత్సాహం ఇపుడు ఆయన మెడకు చుట్టుకుంటోంది. ఈ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని మాసిన యూనిఫాంతో రావడం ఆ టీచరు గమనించారు. విద్యార్థిని చేత దుస్తులు విప్పించి తానే శుభ్రంగా ఉతికారు. చాలాసేపు ఆ విద్యార్థిని అర్ధనగ్నంగా అలాగే నిలబడిపోయింది. ఆరిన దుస్తులు తొడుక్కున్నాక.. ఆమెను క్లాసులోకి పంపారు. ఈ సందర్భంగా ఫొటో తీయించిన ఉపాధ్యాయుడు ఆ చిత్రాన్ని విద్యాశాఖ గ్రూపులో స్వయంగా షేర్‌ చేసి పరిశుభ్రతకు తాను ఎంతో ప్రాధాన్యం ఇస్తానని అందులో చెప్పుకొచ్చారు. ఈ ఫొటో కాస్తా సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారడంతో జిల్లా కలెక్టర్‌ వందనా వైద్య స్పందించారు. ఘటనపై విచారణ జరిపించి, కఠినచర్య తీసుకొంటామని ఆమె ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని