ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇద్దరు స్థానికేతర కార్మికులపై ముష్కరులు కాల్పులు జరిపినట్లు శనివారం పోలీసులు తెలిపారు. గాయపడిన కార్మికులను బిహార్‌లోని బట్యా జిల్లాకు

Published : 25 Sep 2022 04:59 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇద్దరు స్థానికేతర కార్మికులపై ముష్కరులు కాల్పులు జరిపినట్లు శనివారం పోలీసులు తెలిపారు. గాయపడిన కార్మికులను బిహార్‌లోని బట్యా జిల్లాకు చెందిన శంషాద్‌, ఫైజాన్‌ ఖాస్రీగా గుర్తించారు. ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించామని.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారని.. పోలీసులు తెలిపారు. అదేవిధంగా 14 మంది పౌరులు కూడా మృతిచెందినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని