Supriya Sule: సీఎం కుర్చీలో ఎంపీ సుప్రియా సూలే!
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే.. సీఎం కుర్చీలో కూర్చున్నట్లు ఉన్న ఫొటోను ఏక్నాథ్ శిందే వర్గం ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చున్నారో
చిత్రాన్ని ట్వీట్ చేసిన సీఎం వర్గం
ఎన్సీపీ ఫిర్యాదు
ముంబయి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే.. సీఎం కుర్చీలో కూర్చున్నట్లు ఉన్న ఫొటోను ఏక్నాథ్ శిందే వర్గం ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చున్నారో చూడండంటూ శిందే వర్గానికి చెందిన నేత శీతల్ మెహత్రే ట్వీట్లో పేర్కొన్నారు. సీట్లో కూర్చున్న సుప్రియా సూలే వెనకాల ‘మహారాష్ట్ర ప్రభుత్వం- ముఖ్యమంత్రి’ అనే బోర్డు ఉంది. మాజీ మంత్రులు, ఎన్సీపీ నేతలు దిలీప్వాల్సే పాటిల్, రాజేష్ తోపే చిత్రంలో ఉన్నారు. ఇది మార్ఫింగ్ చిత్రమని, విడుదల చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముంబయి పోలీసులకు ఎన్సీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి శిందే కుమారుడు, కల్యాణ్ పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడు శ్రీకాంత్ శిందే.. తన తండ్రి కోసం ఉద్దేశించిన సీట్లో కూర్చున్నట్లున్న చిత్రాన్ని ఎన్సీపీ శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిందే వర్గం సూలే చిత్రాన్ని పోస్టు చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్