ఏనుగుల దాడి.. ఇద్దరు వృద్ధుల మృతి
ఒడిశాలోని కటక్లో రెండు ఏనుగులు జగద్పుర్ ప్రాంతంలో ఇద్దరు వృద్ధులను బలిగొన్నాయి. ఓ వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచాయి. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అటగడ అటవీ ప్రాంతం నుంచి మంగళవారం
వరదలో గున్న ఏనుగు మృత్యువాత
కటక్, న్యూస్టుడే: ఒడిశాలోని కటక్లో రెండు ఏనుగులు జగద్పుర్ ప్రాంతంలో ఇద్దరు వృద్ధులను బలిగొన్నాయి. ఓ వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచాయి. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అటగడ అటవీ ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి జగద్పుర్లోకి చొరబడిన ఏనుగులు బుధవారం ఉదయం బీభత్సం సృష్టించాయి. పలు ఇళ్లతోపాటు రోడ్డు పక్కన ఉన్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశాయి. ఇద్దరు వృద్ధులను తొక్కి చంపేసి, మరొక వృద్ధురాలిని గాయపరిచాయి. అటవీ అధికారులు వచ్చి వాటిని తిరిగి అడవిలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవి మహానది దాటి జగద్పుర్లోకి ప్రవేశించాయని తెలిపారు. నది దాటే క్రమంలో ఓ గున్న ఏనుగు వరద ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందిందని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్