బ్రహ్మపుత్రలో పడవ బోల్తా.. ఏడుగురి గల్లంతు

అస్సాంలోని ధుబ్రీ జిల్లాలో గురువారం ఉదయం బ్రహ్మపుత్ర నదిలో మర పడవ మునిగి ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ప్రభుత్వ అధికారి కూడా ఒకరు ఉన్నారు. క్షేత్ర పరిశీలనకు వెళ్లిన అధికారులు, సిబ్బంది.. కొందరు స్థానికులు, విద్యార్థులు

Published : 30 Sep 2022 05:33 IST

ఈనాడు, గువాహటి: అస్సాంలోని ధుబ్రీ జిల్లాలో గురువారం ఉదయం బ్రహ్మపుత్ర నదిలో మర పడవ మునిగి ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ప్రభుత్వ అధికారి కూడా ఒకరు ఉన్నారు. క్షేత్ర పరిశీలనకు వెళ్లిన అధికారులు, సిబ్బంది.. కొందరు స్థానికులు, విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. చాలామంది ఈదుకొంటూ ఒడ్డుకు చేరగా, స్థానికులు కొందరిని రక్షించారు. మరో ఏడుగురి ఆచూకీ తెలియవలసి ఉందని అధికారులు చెప్పారు.  ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 29 మంది ఉన్నారని, వంతెన స్తంభాన్ని ఢీకొని పడవ మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ గజ ఈతగాళ్లు  గాలింపు చర్యలు చేపట్టారు.  ప్రమాదం నుంచి బయటపడినవారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని