Supremecourt: ప్రభుత్వాల విధులేమిటో చెప్పే బాధ్యత కోర్టులది కాదు: సుప్రీంకోర్టు వ్యాఖ్య

భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రజలందరికీ తెలియడం కోసం దాని ప్రవేశిక(పీఠిక)ను స్థానిక భాషల్లో బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలన్న

Updated : 01 Oct 2022 09:31 IST

దిల్లీ: భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రజలందరికీ తెలియడం కోసం దాని ప్రవేశిక(పీఠిక)ను స్థానిక భాషల్లో బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలన్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏమి చేయాలో, ఎలా చేయాలో వంటి అంశాలను ప్రభుత్వాలకు వదిలేయాలని, న్యాయస్థానం జోక్యం చేసుకోజాలదని తెలిపింది. ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేసేందుకు కోర్టు సరైన వేదిక కాదని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా ధర్మాసనం స్పష్టం చేసింది.  పిటిషనర్‌ అహ్మద్‌ పిర్జాది తరఫు న్యాయవాది వ్యాజ్యాన్ని వెనక్కు తీసుకునేందుకు అంగీకరించారు. హింస, విద్వేషం, మతపరమైన అసహనం పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ పౌరులందరికీ రాజ్యాంగంలో పేర్కొన్న సౌభ్రాతృత్వం, సమానత్వం, లౌకికతత్వం గురించి తెలియాల్సి ఉందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని