నక్సలైట్‌ కూల్చేసిన బడిలోనే.. పాఠాలు చెబుతున్న కోడలు

అది బిహార్‌లో ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో ధ్వంసమైన ప్రాథమిక పాఠశాల. కొన్నేళ్లుగా మూతపడిన ఆ విద్యాలయం ఇప్పుడు చిన్నారులతో కళకళలాడుతోంది.

Published : 02 Oct 2022 04:57 IST

అది బిహార్‌లో ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో ధ్వంసమైన ప్రాథమిక పాఠశాల. కొన్నేళ్లుగా మూతపడిన ఆ విద్యాలయం ఇప్పుడు చిన్నారులతో కళకళలాడుతోంది. ఈ మార్పు వెనుక ఉన్నది స్వయానా ఓ నక్సలైట్‌ కోడలు. 2007లో జముయీ జిల్లాలోని చొర్మరాలో ఉన్న ఆ పాఠశాలను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన బాలేశ్వర్‌ కోడా అనే నక్సలైట్‌ కోడలు రంజూ దేవి. ఆమె స్వయంగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. అంతేకాదు.. తన మామ బాలేశ్వర్‌ నక్సల్‌ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసేలా చేయడంలోనూ ప్రత్యేక చొరవ చూపింది. ఆమె మాట ప్రకారమే బాలేశ్వర్‌ తన అనుచరులతో కలసి ఈ ఏడాది జూన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. విద్య ద్వారా పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నందుకు ఆనందంగా ఉందని రంజూ దేవి పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని