బిహార్లో ప్రశాంత్ కిశోర్ 3,500 కి.మీ. పాదయాత్ర
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ ప్రచారం కోసం బిహార్లో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
నేడు పశ్చిమ చంపారన్లో శ్రీకారం
పట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ ప్రచారం కోసం బిహార్లో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఆదివారం ఆయన ఈ యాత్ర ప్రారంభించనున్నారు. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహర్వా నుంచి ఆయన దీనికి శ్రీకారం చుట్టనున్నారు. ఇది 12 నుంచి 18 నెలల పాటు సాగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించడానికి ఇది ముందస్తు కసరత్తుగా చెబుతున్నా ఆయన మాత్రం ఈ యాత్రలో ప్రజల నిర్ణయం మేరకే తన తదుపరి అడుగులు ఉంటాయని చెబుతున్నారు. ఎలాంటి విరామం లేకుండా సాగనున్న యాత్రలో ప్రతీ పంచాయతీకి ఆయన వెళ్తారు. 2018లో జేడీయూలో చేరిన కిశోర్ 2020లో బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ను విమర్శించి, ఆ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ