Marriage: హిందువుగా మారి.. ప్రియురాలిని మనువాడి..

మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన మతాన్ని మార్చుకొని హిందూ పద్ధతుల్లో మహిళను వివాహం చేసుకున్నాడు. 

Updated : 02 Oct 2022 08:12 IST

మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన మతాన్ని మార్చుకొని హిందూ పద్ధతుల్లో మహిళను వివాహం చేసుకున్నాడు. తన పేరును సైతం మార్చుకున్నాడు. ఉజ్జయినికి చెందిన మహ్మద్‌ నిసార్‌కు.. ఎనిమిదేళ్ల క్రితం రాణి కాయస్థతో పరిచయం ఏర్పడింది. ఇరువురూ క్రమంగా ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తొలి నుంచీ మహ్మద్‌ నిసార్‌కు హిందూ ఆచారాల పట్ల ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే హిందూ మతాన్ని స్వీకరించాడు. వేదమంత్రాల మధ్య మత మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పండితులు మహ్మద్‌ నిసార్‌ పేరును సోనూ సింగ్‌గా మార్చారు. ఆ తర్వాత ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. భవిష్యత్‌లోనూ హిందువుగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. మందసౌర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగో సారి. ఇక్కడ మొత్తం నలుగురు వ్యక్తులు హిందూ మతంలోకి మారారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని