పాఠశాలలో టీకాలు.. 50 మందికి తీవ్ర అస్వస్థత
ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాకు చెందిన 50 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. అప్రమత్తమైన తల్లిదండ్రులు.. పిల్లల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే తమ అనుమతి లేకుండా పిల్లలకు పాఠశాలలో టీకాలు వేశారని, అందుకే వారి ఆరోగ్యం క్షీణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాకు చెందిన 50 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. అప్రమత్తమైన తల్లిదండ్రులు.. పిల్లల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే తమ అనుమతి లేకుండా పిల్లలకు పాఠశాలలో టీకాలు వేశారని, అందుకే వారి ఆరోగ్యం క్షీణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?: జిల్లాలోని థానా దాడోన్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సుమారు 150 మందికి ఆరోగ్య సిబ్బంది టీకాలు వేశారు. ఆ తర్వాత విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లారు. కాసేపటికే 50 మంది పిల్లల ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరోచనాలతో నీరసంగా తయారయ్యారు. మరికొందరికి తీవ్రమైన జ్వరం వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. తమ అనుమతి తీసుకోకుండా పిల్లలకు పాఠశాల సిబ్బంది టీకాలు వేయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ అవనీంద్ర యాదవ్ స్పందించారు. విద్యార్థులకు టీడీ, డీపీడీ టీకాలు వేశామని తెలిపారు. అవి వేస్తే సాధారణంగా విద్యార్థులకు జ్వరం వస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సైతం తెలియజేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!