Mangalyaan: ముగిసిన మంగళయాన్ ప్రస్థానం!.. నిండుకున్న ఇంధనం, బ్యాటరీ
అంచనాలను మించి పనిచేసిన భారత తొలి అంగారక ఉపగ్రహం మంగళయాన్ ప్రస్థానం ముగిసిపోయినట్లు తెలుస్తోంది. ఆ వ్యోమనౌకలో ఇంధనం, బ్యాటరీ స్థాయి.. సురక్షిత పరిమితి కన్నా తక్కువకు పడిపోవడంతో దీని సుదీర్ఘ పరిశోధనలకు తెరపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బెంగళూరు: అంచనాలను మించి పనిచేసిన భారత తొలి అంగారక ఉపగ్రహం మంగళయాన్ ప్రస్థానం ముగిసిపోయినట్లు తెలుస్తోంది. ఆ వ్యోమనౌకలో ఇంధనం, బ్యాటరీ స్థాయి.. సురక్షిత పరిమితి కన్నా తక్కువకు పడిపోవడంతో దీని సుదీర్ఘ పరిశోధనలకు తెరపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ.450 కోట్లతో చేపట్టిన మంగళయాన్ను 2013 నవంబరు 5న పీఎస్ఎల్వీ-సి25 రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించింది. 2014 సెప్టెంబరు 24న అది విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. తద్వారా తొలి ప్రయత్నంలోనే ఆ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ గుర్తింపు పొందింది. నాటి నుంచి ఆ వ్యోమనౌక అప్రతిహతంగా సేవలు అందిస్తూనే ఉంది. నిజానికి ఆరు నెలలు పాటు మాత్రమే పనిచేసేలా దీన్ని రూపొందించారు. అయితే అంచనాలను మించి దాదాపు 8 ఏళ్లపాటు సేవలు అందించింది. అంగారకుడికి సంబంధించిన 8వేలకుపైగా ఫొటోలను పంపింది. ఆ గ్రహ అట్లాస్ను అందించింది. సూర్యకాంతి లభించని ‘గ్రహణం దశ’ను తప్పించుకోవడానికి ఈ వ్యోమనౌక కక్ష్యను పలుమార్లు మార్చాల్సి వచ్చింది. ఫలితంగా అందులోని ఇంధనం ఖర్చయింది. ఇటీవల వరుసగా ఇలాంటి గ్రహణ పరిస్థితులు ఎదురయ్యాయని ఇస్రో వర్గాలు తెలిపాయి. అందులో ఒకదాని నిడివి ఏడున్నర గంటలు ఉందని పేర్కొంది. గంటన్నర గ్రహణాన్ని మాత్రమే తట్టుకునేలా ఈ ఉపగ్రహ బ్యాటరీని రూపొందించారు. అంతకన్నా ఎక్కువసేపు సూర్యకాంతి లభించకుంటే బ్యాటరీలో ఛార్జింగ్ సురక్షిత పరిమితి కన్నా తక్కువ స్థాయికి పడిపోతుంది. ‘‘ప్రస్తుతం ఈ వ్యోమనౌకలో ఇంధనం లేదు. బ్యాటరీ కూడా డ్రెయిన్ అయింది. మంగళయాన్తో సంబంధాలు తెగిపోయాయి’’ అని ఇస్రో వర్గాలు తెలిపాయి. అధికారికంగా ఆ సంస్థ నుంచి దీనిపై ప్రకటన వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్